Header Banner

ఏపీ రైతులకు బంపరాఫర్.. 80శాతం రాయితీ, ఐదుగురు కలిసి రూ.2 లక్షలు కడితే చాలు!

  Fri Jun 13, 2025 12:34        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. వారి కోసం ఓ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. దేశంలోనే మొదటిసారిగా 80% రాయితీతో రైతులకు డ్రోన్లను అందిస్తోంది. రైతులు ఈ డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేసేలా ఆలోచన చేస్తోంది. ఈ ఏడాది జిల్లాల వారీగా రైతు గ్రూపులకు డ్రోన్లను ప్రభుత్వం పరిమితంగా 875 యూనిట్లను మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వం ఐదుగురు రైతుల గ్రూపులను లబ్ధిదారులుగా గుర్తించి.. ఈ మేరకు వారికి వ్యవసాయ శాఖ ద్వారా శిక్షణ కూడా ఇచ్చారు. రైతులకు సంబంధించిన ప్రతి గ్రూపు నుంచి ఒకరికి డ్రోన్ పైలట్ శిక్షణ అందించారు. వ్యవసాయంలో సాంకేతికతను ఉపయోగించడం వల్ల ఖర్చులు తగ్గుతాయని.. పంటలు బాగా పండుతాయని ప్రభుత్వం భావిస్తోంది.. అందుకే ఈ డ్రోన్లను తీసుకొచ్చింది. ఒక్కో డ్రోన్ యూనిట్ ధర రూ.9.80 లక్షలు కాగా.. రైతు వాటా రూ.1.96 లక్షలు.. మిగిలిన రూ.8 లక్షలు ప్రభుత్వమే చెల్లిస్తుంది.

 

ఇది కూడా చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

అంతేకాదు రైతులకు సంబంధించి వాటాగా ఉన్న డబ్బుల్ని బ్యాంక్ ద్వారా రుణం ఇప్పిస్తుంది ప్రభుత్వం.. ఆ డబ్బును నేరుగా డ్రోన్ కంపెనీలకు చెల్లిస్తారు. డ్రోన్‌ ద్వారా ఒక ఎకరంలో పురుగుమందును ఏడు నిమిషాల్లో పిచికారీ చేయొచ్చు. అదే రైతు ట్యాంక్ ద్వారా స్ప్రే చేయాలంటే కనీసం రెండు గంటల సమయం పడుతుంది అంటున్నారు. డ్రోన్ 12 లీటర్ల నీళ్లతో ఎకరా పంటకు నేరుగా మొక్క మీదకు స్ప్రే చేస్తుంది. ఒక్క ఎకరాకు డ్రోన్‌తో మందు పిచికారీ చేస్తే రూ.350 వసూలు చేస్తారు.. అదే పని మనుషులతో చేయిస్తే ఇద్దరు అవసరం ఉంటుంది. రైతులకు ఇచ్చే డ్రోన్ 12 లీటర్ల ట్యాంకుతో ఉంటుంది.. రోజుకు 10 ఎకరాల్లో మందు పిచికారీ చేయొచ్చు అంటున్నారు. డ్రోన్ల సాయంతో మందులు స్ప్రే చేస్తే రైతులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఒకవేళ రైతుల కనుక మందులు స్ప్రే చేస్తే ముక్కు, నోట్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ కారణంగా శ్వాసకోశ, జీర్ణాశయ, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే పురుగుమందుల్ని స్ప్రే చేయించడానికి డ్రోన్లను తీసుకొచ్చారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం రైతులకు డ్రోన్లు కూడా అందిస్తూ వారికి ఇబ్బందు లేకుండా చేస్తోంది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

 

ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!

 

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!

 

శుభవార్త: రూ.6,405 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం! ఏపీ సహా 3 రాష్ట్రాలకు చాలా మేలు!

 

నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!

 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #Government #Provides #Drones For Farmers #80Percent Discount